కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం శ్రీవారి రథోత్సవం వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి రథంపై నుంచి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు రథాన్నిలాగారు.