జోగిపేట పట్టణంలో రుద్ర సేన యూత్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరన్ననవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జోగిపేట 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ దంపతులు రాధిక ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు మహా కుంకుమార్చన పూజ నిర్వహించనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వహకులు కోరారు.