నియామక పత్రం అందుకున్న అయేషా
NEWS Oct 11,2024 04:42 am
టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన మండల కోఅప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మజర్ సతీమణి అయేషా ఫాతిమా డిఎస్సీ -2024 బయాలజీకాల్ సైన్స్ ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగా జిల్లా డిఈఓ రాధా కిషన్ అయేషాకు నియామక పత్రాన్ని అందచేశారు. అయేషా మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.