జువ్వాడి స్మారక వాలీబాల్ టోర్నమెంట్
NEWS Oct 11,2024 04:33 am
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో విజేతలుగా మొదటి స్థానంలో సిర్పూర్ జట్టు, 2వ స్థానంలో సాతారం జట్లు నిలిచాయి. విజేతలకు టీ-పీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.