మల్యాల మండల కేంద్రంలో గురువారం వాడవాడలా సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సంబరంగ జరుపుకున్నారు. అనంతరం చెరువుల వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్థానిక ఎస్సై నరేష్ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ ఘాట్లను పరిశీలించారు.