తిరుమలలో రీల్స్.. మాధురిపై కేసు
NEWS Oct 10,2024 05:05 pm
దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద తిరుమల పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీల్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. కొండపై దువ్వాడ, మాధురి ఫొటోషూట్, రీల్స్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.