భారత్పై న్యూజిలాండ్ PM అభిమానం
NEWS Oct 10,2024 04:10 pm
భారత్కి తాను పెద్ద అభిమానినని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అన్నారు. లావోస్లో జరుగుతున్న ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో మోడీ.. క్రిస్టోఫర్తో భేటీ అయ్యారు. 2 దేశాల మధ్య సంబంధాలపై ఇరువురు ప్రధానులు చర్చించిన అనంతరం న్యూజిలాండ్ PM లక్సన్ మాట్లాడుతూ.. భారత్ తాను విపరీతంగా ప్రేమించే, ఆరాధించే దేశమని తన అభిమానాన్ని చాటుకున్నారు. న్యూజిలాండ్లో ఉన్న భారతీయులు బాగా పని చేస్తారని కొనియాడారు.