ప్రజలను ఆదుకుని ప్రభుత్వం
NEWS Oct 10,2024 03:58 pm
ప్రజలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండే ప్రభుత్వం తమది కాదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వంటనూనె ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్ లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అనంతపురం రైతు బజార్ లో వంట నూనెల కొనుగోలు కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రారంభించారు.