మెట్ పల్లి మండల కేంద్రంలోని మహాలక్ష్మి నగర్, బీడీ కాలనీలో శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు, భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.