మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ఉండే పెద్ద దిక్కును కోల్పోవడంతో యావత్ భారతవని దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.