పాత్రికేయునికి ఎమ్మెల్యే పరామర్శ
NEWS Oct 10,2024 12:22 pm
మెట్ పల్లి, మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ మెట్ పల్లి రూరల్ విలేకరి బెజ్జారపు అన్వేష్ తండ్రి అంజయ్య ఇటీవలే మృతిచెందగా వారి కుటుంబాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపిపి మారు సాయి రెడ్డి, నాయకులు అంజయ్య, దుద్దుల తిరుపతి, కాపాడి తిరుపతి, నవీన్, రాజారాం, రాజు తదితరులున్నారు.