శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
NEWS Oct 10,2024 12:33 pm
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి హెచ్చరించారు. బుగ్గారం మండలంలోని గోపులాపూర్ గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని గ్రామస్తులతో శాంతి సమావేశాన్ని బుగ్గారం ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి పాల్గొన్నారు.