బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలి
NEWS Oct 10,2024 12:22 pm
ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.