పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Oct 10,2024 12:20 pm
మెట్ పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో శ్రీ వాసవి హైస్కూల్ నందు 25 సంవత్సరాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగినది. ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాత విషయాలను నెమరు వేసుకొని ఆటపాటలతో రోజంతా సరదాగా గడిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం కూడా పాల్గొని ఆనాటి రోజులను గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు.