జగిత్యాల మున్సిపల్ అభివృద్ధి పనుల బిల్లులకు సంబంధించి రూ.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో జరిగిన పనులకు సంబంధించి కొన్ని నెలలుగా గుత్తేదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా నిధులు విడుదలయ్యాయి. నెలల తరబడి పెండింగులో ఉన్న బిల్లుల విడుదలకు కృషిచేసిన ఎమ్మెల్సీకి గుత్తేదారుల సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు.