సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు
NEWS Oct 10,2024 05:38 am
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ఈ సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని NCPA గ్రౌండ్లో ఉంచారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరవుతారు.