అరుదైన రత్నాన్ని దేశం కోల్పోయింది
NEWS Oct 10,2024 06:09 am
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతిపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు సంతాపం తెలిపారు. అన్ని రంగాలలో ప్రకాశించే అరుదైన రత్నాన్ని భారతదేశం కోల్పోయిందని, ఆయన నిరాడంబరత, సేవా భావం అన్ని జీవుల పట్ల కారుణ్యం అందరిని ఆకర్షించిందన్నారు. వ్యాపార వేత్తలు తమ లాభాలలో ఏమేరకు సమాజ అభివృద్ధికి ఖర్చు చేయాలో చేసి చూపించిన మహానుభావుని మరణం దేశానికి పెద్ద లోటు అని, ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.