PRTU రాష్ట్ర కార్యదర్శిగా కిషన్ నాయక్
NEWS Oct 10,2024 03:41 am
ఈ నెల 7, 8 న హైదరాబాద్ లో జరిగిన పి ఆర్ టి యు 35 రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో ఆళ్లపల్లి మండల పూర్వ అధ్యక్షుడు కిషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆళ్లపల్లి మండలానికి సుదీర్ఘ కాలం అధ్యక్షుడుగా సేవలు అందించి ఉపాద్యాయుల సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించి ఏజెన్సీ ప్రాంతంలో సంఘ బలోపేతానికి చేసిన కృషిని గమనించి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి కిషన్ నాయక్ జిల్లా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.