హైదరాబాద్ కు డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు
NEWS Oct 09,2024 06:44 pm
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను విడుదల చేసి,ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో నియామక పత్రాలు అందజేయనుండగా, జిల్లానుంచి తరలివెళ్లారు. 3 బస్సుల్లో 130మంది తరలివెళ్లే వాహనాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్, ఎస్ జి టీ, భాషా పండితులు, పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు అర్హత సాధించారని తెలిపారు.