KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్ పాఠశాలలో గురువారం నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి బతుకమ్మను ఆడాలని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆమె తెలిపారు. ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామన్నారు.