2028 వరకూ ఉచిత బియ్యం పంపిణీ
NEWS Oct 09,2024 03:16 pm
పండగల సీజన్లో మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహార ధాన్యాలను అందించేందుకు ఉద్దేశించిన PMGKAYను మరో నాలుగేళ్లు పొడిగిస్తున్నామని, దీంతో ప్రభుత్వానికి రూ.17,052 కోట్ల ఖర్చు అవుతుందని తెలియజేసింది.