అమ్మవారిని దర్శించుకున్న బోగ శ్రావణి
NEWS Oct 09,2024 03:16 pm
కరీంనగర్ పట్టణంలోని శ్రీమహాశక్తి ఆలయంలో అమ్మవారిని బిజెపి జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈకార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, పవన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.