విశాఖలో TCS క్యాంపస్.. 10 వేల జాబ్స్
NEWS Oct 09,2024 03:11 pm
విశాఖపట్నంలో మరో మణిహారం చేరబోతోంది. TCS క్యాంపస్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. భారీ పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా ఈవీ, ఏరోస్పేస్, టూరిజం, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని ఇదివరకే టాటా గ్రూపు ప్రకటించింది. ఈ క్రమంలో టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్తో మంత్రి లోకేశ్ ముంబయిలో భేటీ అయ్యారు.