టీడీపీలోకి మోపిదేవి, బీదా మస్తాన్
NEWS Oct 09,2024 02:43 pm
అమరావతి: రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటరమణ, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.