ఘనంగా సరస్వతీ పూజ
NEWS Oct 09,2024 02:30 pm
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా గంగలకుర్రు గ్రామంలో వున్న రావులమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, 200 మంది విద్యార్థులు విచ్చేసి సరస్వతీ పూజ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు విద్యార్థులు అందరికీ పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పలకలు అందజేసారు.