సనాతన ధర్మ హిందూ ఐక్యవేదిక ర్యాలీ
NEWS Oct 09,2024 02:29 pm
కోరుట్లలో సనాతన ధర్మ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నుండి RDO కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహాదేవ స్వామీజీ (మహాదేవ స్వామీజీ పీఠం) మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు జాతీయ, రాష్ట్రస్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.