ఘనంగా దుర్గాదేవి పల్లకి ఊరేగింపు
NEWS Oct 09,2024 02:28 pm
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ ఇందిరానగర్లో దుర్గాదేవి పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. భవాని యూత్ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు నృత్యాలు చేస్తూ, కోలాటాలతో ఇందిరానగర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దుర్గామాత భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.