కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో శ్రీ దుర్గా మాత మండపంలో గ్రామ ప్రజల భవాని దీక్ష తీసుకున్న సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో గ్రామ ప్రజలకు పచ్చని విస్తరు వేసి మహిళ భవాని యువతులతో బంతి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో దుర్గా కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.