అమ్మవారిని దర్శించుకున్న ఆది శ్రీనివాస్
NEWS Oct 09,2024 12:55 pm
దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా కథలపూర్ మండలం గంభీర్ పూర్, అంబరిపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న దుర్గా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.