ఉపాధ్యాయులను ప్రభుత్వం అప్గ్రేడ్ చేయాలి
NEWS Oct 09,2024 09:11 am
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న తెలుగు, హిందీ, పి.ఈ.టీ ఉపాధ్యాయులను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసేవిధంగా సహకారం అందించాలని హైదరాబాద్ సెక్రటేరియట్లో ఇల్లందు ఎంఎల్ఏ కోరం కనకయ్య, ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మ బొజ్జు కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యంపీ నాయక్, మూకర రాంబాబు, గుగులోత్ కృష్ణ, రఘునాథ్, సరిరాం పాల్గొన్నారు.