దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
NEWS Oct 09,2024 09:04 am
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ను సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్స్తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయం వద్ద చంద్రబాబుకు ఆలయ అధికారులు స్వా గతం పలికి దర్శన ఏర్పా ట్లు చేశారు.