జోగిపేట పట్టణానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు లింగమయ్య గౌడ్ కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. అనారోగ్య బాధపడుతున్న ఆయనను హైదరాబాదులోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా, చికిత్స పొందుతూ మరణించినట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. 1928లో జన్మించిన ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. లింగమయ్య గౌడ్ మృతికి మంత్రి దామోదర్ రాజనర్సింహ సంతాపం తెలిపారు.