మద్యం టెండర్ల షెడ్యూల్ను మార్చాలని విజ్ఞప్తులు రావటంతో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల కారణంగా బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు తీసుకెళ్లడంతో ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. 14న మధ్యం షాపులకు లాటరీ తీస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది.