బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మినా, కొన్నా జరిమానా
NEWS Oct 09,2024 05:11 am
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం బొబ్బిలి గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమ గ్రామంలో బెల్ట్ షాపుల్లో మద్యం, మత్తు పదార్థాలు అమ్మకూడదని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ఎవరు వ్యతిరేకించినా, మద్యం అమ్మిన వారికి రూ. 10,000, మద్యం కొన్నవారికి రూ. 5000 జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నల్లోల్లకుమార్, మాజీ ఉపసర్పంచ్ సురేష్, గ్రామ పెద్దలు వీరారెడ్డి, గోపాల్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.