ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమారెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి హైదరాబాద్ లోని మంత్రి నివాసంతో ఉత్తమ్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.