తాగుడుకు బానిసై ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
NEWS Oct 09,2024 02:59 pm
కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు (40) అనే వ్యక్తి తాగుడుకు బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు..రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.