వేములవాడ రాజన్నను దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి.
NEWS Oct 09,2024 04:31 am
సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రికి ఈవో కె.వినోద్ రెడ్డి పూల మొక్కతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు ఆశీర్వదించగా ఈవో లడ్డూ ప్రసాదం అందజేశారు.