మెట్ పల్లి పట్టణంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొని రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి అనంతరం అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ - హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలు వేడుకగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, పువ్వులను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని చెప్పారు.