ఓటర్ జాబితా రూపకల్పన పక్కాగా చేపట్టాలి
NEWS Oct 08,2024 05:56 pm
రాష్ట్రంలో ఖాళీ త్వరలో కానున్న టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ జాబితా రూపకల్పన నిబంధనల ప్రకారం పక్కాగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నాగిరెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పనపై జిల్లాల కలెక్టర్ లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. సమీకృత సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పాల్గొన్నారు.