సిరిసిల్లలో బతుకమ్మ సంబరాలు
NEWS Oct 08,2024 05:50 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలో ని మానేరు నది తీరాన బతుకమ్మ ఘాట్ లో సిరిసిల్ల పురపాలకల సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మ) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, గడ్డం చందన భగవాన్, దార్ల కీర్తన సందీప్, దిడ్డి మాధవి రాజు పాల్గొన్నారు.