టాటా గ్రూప్ నుంచి ఏపీకి బిగ్ న్యూస్
లోకేష్ ట్వీట్పై సర్వత్రా ఆసక్తి
NEWS Oct 08,2024 04:47 pm
టాటా సన్స్ గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ భేటీపై ఆయన ఎక్స్లో స్పందించారు. టాటా గ్రూప్ నుండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అతిపెద్ద వార్త వినబోతున్నారని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో ఆ వార్త ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినదే అయివుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.