రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి కూడా అక్కడే బస చేయనున్నారు. ప్రధాని మోడీసహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన చంద్రబాబు.. బుధవారం ఉదయం 9:30కు ఢిల్లీ నుంచి బయల్దేరి 11:40కి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.