రేపు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ..!
NEWS Oct 08,2024 04:17 pm
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం నాడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనిమిస్తారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తుల దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల వరకు వీఐపీ దర్శనాలు లేవని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.