సొసైటీల్లో ఎరువుల అమ్మకాలు
NEWS Oct 08,2024 04:35 pm
జిల్లాలోని అన్ని కోపరేటివ్ సొసైటీల్లో ఎరువుల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వీ. సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కోపరేటివ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 కోపరేటివ్ సొసైటీలు ఉండగా, అందులో 11 సొసైటీలలో ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.