మహిళాకు చైర్మన్ ఆర్థిక సహాయం
NEWS Oct 08,2024 03:38 pm
లేపాక్షి మండల పరిధిలోని కోడిపల్లి గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మమ్మ ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు నేలమట్టమయింది. ఆమె నిరుపేద మహిళ, ఉన్న ఇల్లు పడి పోవడంతో ఆమెకు నిలువ నీడ లేకుండా పోయింది. ఈ విషయాన్ని వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ దృష్టికి కోడిపల్లి గ్రామ వాసులు తీసుకువెళ్లడంతో అందుకు స్పందించిన ఆయన 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గొల్ల లక్ష్మమ్మకు అందజేశారు.