సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన E. సువర్ణ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలుపగానే తక్షణమే స్పందించి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 3 లక్షలు రూపాయలు మంజూరు చేయించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.