తిరుపతిలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో నిర్వహించిన సభలో సనాతన ధర్మపరిరక్షణకై డిక్లరేషన్ ప్రకటించారు. ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుతోపాటు మరో 6 అంశాలతో కూడిన డిక్లరేషన్ను పవన్ విడుదల చేశారు.