అక్టోబర్ 4న కలెక్టరేట్ ముట్టడి
NEWS Oct 02,2024 01:38 pm
అక్టోబర్ 4న జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి తరలి రావాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక రైతు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెట్పల్లిలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకి 15000 రైతు భరోసా, అలాగే వరికి క్వింటాల్కి 500 బోనస్ ప్రకటించాలని కోరుతూ చేపట్టిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.