మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో
రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
NEWS Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల మేరకు జరిమానాలు విధించారు.వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన టాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు ఎప్పటికప్పుడు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపితే సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.