మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేద్దామని TGIIC చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం గంజి మైదానంలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ నాయకులు పాల్గొన్నారు.